Friday, May 10, 2024

పర్సనల్‌ మేనేజర్‌కు సన్మానం

శ్రీరాంపూర్‌ : ‌ ఏరియాలో పర్సనల్‌ మేనేజర్‌గా పనిచేసి భూపాలపల్లి ఏరియాకు పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా వెళ్తున్న అజ్మీర తుకారాంను ఇంచార్జి జీఎం కె.హెచ్‌.ఎన్‌.గుప్త, పర్సనల్‌ జీఎం గోవిందరాజులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇంచార్జి జీఎం గుప్త మాట్లాడుతూ శ్రీరాంపూర్‌ ఏరియా పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన అజ్మీర తుకారాం సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన మరెన్నో పదోన్నతులు పొందాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకెఎస్‌ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్‌) నికోలస్‌, పర్సనల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌, సీనియర్‌ పిఓ కాంతారావు, పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది, టీబీజీకెఎస్‌ యూనియన్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement