Sunday, May 5, 2024

అడ‌వి పంది దాడిలో ఇద్ద‌రికి గాయాలు..

తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్ గ్రామ పంచాయతీలోని గంపన్ పల్లి అటవీ ప్రాంతంలో బుధవారం అడవి పంది దాడిలో వేల్మల భీమయ్య, జయనేని శ్రీనివాస్ లు గాయాలపాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. గంపన పల్లి గ్రామానికి చెందినగిరజనులు ఫారెస్ట్ అధికారులతో కలిసి పోడు భూముల సర్వేకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ పంది ఒక్కసారిగా గుంపుగా ఉన్న వారిపై దాడికీ పాల్పడింది. ఈ దాడిలో గంపన్ పల్లికి చెందిన భీమయ్య, శ్రీనివాస్ లకు గాయాలైయ్యాయి. వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement