Saturday, April 27, 2024

TS: ధర్మారంలో విషాదం.. లిఫ్ట్ కాలువ‌లో ప‌డి విద్యార్థి మృతి…

జన్నారం,మార్చి 25 (ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లాలో హోలీ పండుగ పూట విషాధం నెల‌కొంది. జన్నారం మండలంలోని ధర్మారంలో లిఫ్ట్ కాలువలో ఈత‌కు మృతి చెందాడు.

విద్యార్థి గొపులాపురం కార్తీక్ (15) తన అమ్మమ్మ ఊరైన దండేపల్లి మండలంలోని మామిడిపల్లికి వరుసగా సెలవులు రావడంతో శుక్రవారం వెళ్లాడు. ఆ తర్వాత సోమవారం హోలీ పర్వదినం కావడంతో మిత్రులతో ఎంతో సరదాగా హోలి ఆటాడుకొని ఉదయం 11.30 గంటలకు, అదే మండలంలోని తానిమడుగు గ్రామ సమీపాన ఉన్న లిఫ్ట్ కాలువ వద్దకు వెళ్లి మిత్రులతో స్నానం చేస్తుండగా, కార్తీక్ కు ఈత రాకపోవడంతో లోతైన ఆ లిఫ్టు కాలువ నీట‌మునిగి మృతి చెందాడు.

విషయం తెలుసుకొని పోలీసులకు అక్కడికి చేరుకొని ఆ మృతదేహాన్ని ఆ నీటిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం లక్షేటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి అశ్విని ఫిర్యాదు మేరకు దండేపల్లి ఎస్సై స్వరూపరాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధర్మారం గ్రామానికి చెందిన గొపులపురం ప్రసాద్, అశ్విని దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కార్తీక్ మొదటి కుమారుడు. ప్రసాద్ బతుకుదెరువు నిమిత్తం విదేశాలకు వెళ్లి పనిచేస్తున్నాడు. పెద్ద కొడుకు చనిపోవడంతో తల్లి అశ్విని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది దీంతో ధర్మారంలో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement