Saturday, April 27, 2024

TS: తెలంగాణ ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడిగా బాబూ మోహ‌న్

ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్‌ను నియ‌మితుల‌య్యారు.. ఈ మేర‌కు ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ఉత్త‌ర్వులు జారీ చేశారు… కాగా, బాబూ మోహన్ కొద్ది రోజుల క్రితమే ప్రజా శాంతి పార్టీలో చేరారు.

- Advertisement -

అంత‌కు ముందు బీజేపీ పార్టీలో ఉన్న బాబూ మోహ‌న్ కు తనని తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసిందని క‌మ‌లం పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్ర‌మ‌లోనే ఆయనకు అందోల్ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన దామోదర రాజనరసింహ గెలిచారు. బీఆర్‌ఎస్‌ నుంచి చంటి క్రాంతి కిరణ్‌ రెండో స్థానంలో నిలువగా బాబూ మోహన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఇక బిజెపి నుంచి వ‌రంగ‌ల్ లోక్ స‌భ స్థానం ఆశించారు. ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ పార్టీకి రాజీనామా చేసి ప్ర‌జాశాంతి పార్టీలో చేరారు.. తాజాగా ఆయ‌న తెలంగాణ శాఖ‌కు అధ్య‌క్షుడిగా నియ‌మితుల‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement