Friday, May 17, 2024

ఓనీ – బాసర రోడ్డు నిర్మాణానికి సహాయమందిస్తా… రామారావు పటేల్

ఓనీ-బాసర రోడ్డు నిర్మాణానికి సహాయమందిస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామారావు పటేల్ తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని ఓని, కౌట గ్రామాలలో గురువారం రామారావు పటేల్ విస్తృతంగా పర్యటించి వరద ముంపునకు గురై పడిపోయిన ఇండ్లు, పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ…వరద ముంపునకు గురై నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని ప్రభుత్వానికి విన్నవించారు. అదేవిధంగా ఓని గ్రామం నుండి బాసరకు వెళ్లే రోడ్డు మార్గాన్ని వెంటనే పునరుద్ధరించాలని అధికారులను కోరారు. వీరితో బాసర మండలం కౌటా గ్రామ సర్పంచ్ మధు పటేల్, ch సాయినాథ్, అలాగే తానూర్ మండల నాయకులు జౌల మాజీ సర్పంచ్ చక్రు పటేల్, ముధోల్ మండలం బీజేపీ నాయకులు రమేష్, శ్రీనివాస్, పోతన్న, భూషణ్, బాను, గంగా ప్రసాద్, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement