Thursday, May 2, 2024

TS | కొమురంభీమ్ జిల్లాలో 30న‌ సీఎం ప‌ర్య‌ట‌న‌.. ఏర్పాట్ల‌ను పరిశీలించిన‌ ఎమ్మెల్సీ విటల్‌

కాగజ్ నగర్ టౌన్, (ప్రభన్యూస్) : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈనెల 30వ తేదీన సీఎం కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగే బహిరంగ సభ ఏర్పాట్లను వర్షంలో సైతం దగ్గరుండి ఎమ్మెల్సీ దండేవిటల్ పర్యవేక్షించారు. రెండు రోజులుగా ఏర్పట్లలో ఏ లోటు పాట్లు లేకుండా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. వర్షాన్ని లెక్కచేయకుండా బురదలో సభాస్థలి ప్రాంగణం మొత్తం తిరుగుతూ అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆయన వెంట కుమ్మరం భీం ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జెడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement