Tuesday, April 30, 2024

ADB: ఇచ్చిన హామీల‌న్ని నెర‌వేరుస్తా…ఎమ్మెల్యే వివేక్ వెంక‌ట‌స్వామి

చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేరుస్తాన‌ని ఎమ్మెల్యే వివేక్ వెంక‌ట‌స్వామి తెలిపారు. చెన్నూరు మండలం లక్ష్మీపూర్‌లో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలను ఆయన ప్రారంభించారు.

మిషన్ భగీరథ నీటి సరఫరా 15 రోజుల్లో చేయాలని అధికారులను ఎమ్మెల్యే వివేక్ ఆదేశించారు. ఎమ్మెల్యే అయ్యాక మొదటి ప్రారంభం పాఠశాల కావడం మారుమూల గ్రామం లక్ష్మీపూర్ లో చేయడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. 28 నుండి జరగనున్న గ్రామసభల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుక‌రావాల‌ని, గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాన‌ని, బస్సు, రోడ్లు, మంచినీటి సౌకర్యాల ను కల్పిస్తానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement