Thursday, May 2, 2024

Srisailam – రావ‌ణ వాహ‌నంలో ముక్కంటి…చూసి పుల‌కించిపోయిన భ‌క్త జ‌నం

శ్రీశైలం – ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో శ్రీ భ్రమరాంబా సమేత మల్లి కార్జునస్వామివారు రావణ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయలోని ఉత్తర ద్వారం వద్ద ఉత్తర ముఖంగా స్వామి అమ్మవార్లను రావణ వాహనంపై ఆశీనులను చేసి అర్చకులు వేదపండితుల ప్రత్యేక పూజలు నిర్వహించి హరతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్లు రావణ వాహనంపై ఆలయ ప్రదక్షిణ సాగుతుండగా భక్తులు భక్తి శ్రద్ధలతో రావణ వాహనంలో ఉన్న స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కాగా, స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు వెల్లువెత్తారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement