Saturday, April 27, 2024

అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దు..

బెల్లంపల్లి : ప్రజలు అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రావద్దని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. పట్టణంలోని 6, 24వ వార్డుల్లో పర్యటించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉదృతంగా విజృంభిస్తున్న సందర్భంగా ప్రజలు అత్యవసర సమయాల్లోనే బయటకు రావాలని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తనకు తెలియజేయాలని తెలిపారు. ఆయన వెంట కౌన్సిలర్లు దామెర శ్రీనివాస్‌, మాటూరి మధు, టీఆర్‌ఎస్‌ నాయకులు గడ్డం భీమాగౌడ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement