Friday, April 26, 2024

గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటుతో విశాఖ నుంచి ముంబైకి బ‌య‌లుదేరిన ఆక్సిజ‌న్ ఎక్స్ ప్రెస్….

విశాఖపట్నం, దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజూకీ కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా పలు ఆసుపత్రులలో ఔషధాలు, బెడ్స్‌ కొరతనే కాకుండా ఆక్సిజన్‌ కోరత ఏర్పడుతోంది. ఆక్సిజన్‌ లేకపోవడంతో చాలాచోట్ల కరోనా రోగులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత రైల్వే ద్వారా ఆక్సిజన్‌ ట్యాంకర్లను రాష్ట్రాల్రకు సరఫరా చేయాని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్‌ను సరఫరా చేయనున్నారు. దీంతో ద్రవ ఆక్సిజన్‌ను తీసుకెళ్లేందుకు మొదటి ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలు గురువారం తెల్లవారు జామున విశాఖపట్టణానికి చేరుకుంది. అనంత‌రం మొత్తం 7ట్యాంకర్లు లో 100 టన్నులు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నింపారు.. నాలుగు ట్యాంకర్ల‌లో 16 టన్నులు , మూడు ట్యాంక‌ర్ల‌లో 13 టన్నులు లిక్విడ్ ఆక్సిజెన్ ను ఫిల్ చేశారు.. అ తర్వాత ఈ అక్సిజన్ ఎక్స్ ప్రెస్ మహారాష్ట్రకు గురువారం అర్ధరాత్రి బయలుదేరి వేళ్లింది. అయితే ఈ గూడ్స్‌ రైలు మార్గమధ్యంలో ఆగకుండా రైల్వే శాఖ ప్రత్యేకంగా గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటు చేసింది. దీంతోపాటు- ఈ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌కి సాయుధ దళాలు పహారా కాస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి మొదటి ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సోమవారం సాయంత్రం కలంబోలి యార్డ్‌ నుంచి బయ ల్దేరిశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు గురువారం తెల్లవారుజామన చేరుకుంది. ఈ మేరకు ట్యాంకర్లను వ్యాగన్లల్లో ఎక్కించడానికి, దింపడానికి వీలుగా స్టీల్‌ప్లాంట్‌ లోని యార్డ్‌ వద్ద ర్యాంప్‌ కూడా నిర్మించారు. య‌ద్దప్రాతిప‌దిక‌న‌ ఏడు ట్యాంకర్లలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ను నింపారు… అనంత‌రం అక్క‌డి నుంచి ఆ ఆక్సిజ‌న్ రైలు ముంబైకి బ‌య‌లుదేరింది.. ఈ రైలు ఎక్క‌డ ఆగ‌కుండా నేరుగా ముంబైకి నేటి సాయంత్రం చేర‌నుంది.. అదేవిధంగా మ‌రికొన్ని ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ రైళ్లు విశాఖ‌కు చేరుకోనున్నాయి.. ట్యాంక‌ర్ల్లో నింపేందుకు అవ‌స‌ర‌మైన ఆక్సిజన్ ను విశాఖ స్టీట్ ప్లాంట్ సిద్ధం చేసింది.. అలాగే ర‌వాణ సిబ్బంది, సాంకేతిక సిబ్బంది పెద్ద సంఖ్య‌లో అందుబాటులో ఉంచారు.. ఇదిలాఉంటే.. కేంద్రం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు- పరం చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఉద్యోగులు, ఏపీ వాసులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అత్యధికంగా సహజ వాయువును ఉత్పత్తి చేస్తూ మన్ననలు పొందుతోంది. కేంద్రం వదిలించుకోవాలని చూసిన ప్లాంటే ఇప్పుడు ఊపిరిపోస్తుందంటూ విశాఖ వాసులు పేర్కొంటు-న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement