Friday, May 3, 2024

West Bengal: సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి గాయం.. హెలికాప్టర్ ఎక్కుతుండగా…

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ శనివారం ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి హెలీకాప్టర్ ఎక్కుతుండగా కాలు స్లిప్ అయి కింద పడ్డారు. దాంతో, ఆమె కాలుకు స్వల్ప గాయమైంది. ఇవాళ‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ అసన్‌సోల్ లోక్‌సభ అభ్యర్ధి శతృఘ్న సిన్హా మద్దతుగా రోడ్ షోతో పాటు అసన్‌సోల్, కుల్టీలలో ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించనున్నారు. అయితే దీదీ ఇందుకోసం దుర్గాపూర్ నుంచి అసన్‌సోల్‌కు వెళ్లేందుకు హెలికాఫ్టర్‌ ఎక్కారు.

హెలికాఫ్టర్‌ లోపలికి ఎక్కిన తర్వాత కాలు జారీ పడ్డారు. సిబ్బంది అప్రమత్తం కావడంతో ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement