Tuesday, May 14, 2024

TS : బోర్‌వేల్‌కు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ భూమి పూజ

ఉట్నూర్, మార్చి 16( ప్రభ న్యూస్) అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని దొంగ చింత గ్రామంలో నూతన బోర్‌వేల్‌కు శనివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారంగా ఎస్డిఎఫ్ పథకం కింద రెండు లక్షలతో నూతన బోర్వెల్ వేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దొంగ చింత గిరిజనులకు నీటి సమస్య పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుందామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎంపీడీవో మురళీధర్ శర్మ, నాయకులు ,ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement