Friday, May 17, 2024

కల్లాల నిర్మాణాలను పరిశీలించిన ఏడీఏ..

కాసిపేట : మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పంట కల్లాల నిర్మాణ పనులను ఏడిఏ సురేఖ పరిశీలించారు. పెద్దనపల్లి, వరిపేట, కోనూరు గ్రామాల్లో సబ్సిడీపై రైతులు నిర్మిస్తున్న కల్లాలను పరిశీలించి సమయంలోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. రైతులు దళారుల మాటలు నమ్మి నకిలీ విత్తనాలు కొనుగోలు చేయరాదని, అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సూచించారు. ఏడిఏ వెంట ఏఈఓలు తిరుపతి, శ్రీధర్‌, ఏపిఓ నవీన్‌, ఆయా గ్రామాల రైతులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement