Thursday, May 16, 2024

ADB: అవకాశమిస్తే.. అవినీతి లేని పాలనతో అభివృద్ధి చేస్తా… ఏలేటి మహేశ్వర్ రెడ్డి

లక్ష్మణ చందా, నవంబర్ 2 (ప్రభ న్యూస్) : రానున్న ఎన్నికల్లో బీజేపీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనకు అవకాశం కల్పించి గెలిపిస్తే నిర్మల్ నియోజకవర్గంలో అవినీతి లేని పాలనతో అభివృద్ధి చేస్తానని నిర్మల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మండలంలోని వాడ్యల్ రాచాపూర్ పొట్టపల్లి కె గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వాడ్యాల్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పార్టీలోకి చేరగా.. వారికి భాజపా కండువాలు వేసి ఆహ్వానించారు.

నిర్మల్ నియోజకవర్గం అభివృద్ధికి అనుక్షణం పాటుపడతానన్నారు అనంతరం రాచాపూర్, పొట్టపల్లి కె గ్రామాల్లో జరిగిన ప్రచారంలో గడపగడపకు వెళుతూ ఓట్లను అభ్యర్థించారు. గ్రామానికి వచ్చిన మహేశ్వర్ రెడ్డికి ఆయా గ్రామాల మహిళలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో మండల నాయకులు గాండ్ల చిన్నయ్య, లక్ష్మణ్, వేణు, శ్రీధర్, పోషెట్టి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement