Friday, May 10, 2024

MLA: అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి… రాథోడ్ బాపురావు

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ.. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. గురువారం మండలంలోని అరెపల్లి గ్రామంలో ఎస్టీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం దిక్సూచి అన్నారు.

దేశంలో రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీఆరెఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగా సింగ్, ఎంపీపీ రాథోడ్, సజన్ ఎంపీటీసీ పండరీ కో అప్షన్ సభ్యులు సయ్యద్ లాలూ, మాజీ ఎఎంసీ చైర్మన్ నారాయణ్ సింగ్, కమల్ సింగ్, కరణ్ సింగ్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement