Sunday, May 19, 2024

భార్య‌కు మ‌త్తు ఇచ్చి వ్య‌భిచారం – భ‌ర్త‌తో స‌హా 52 మందికి అర‌దండాలు..

పారిస్‌: భార్యతో ఓ వ్యక్తి అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘోర ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫ్రాన్స్‌కు చెందిన నిందితుడి పేరు డొమినిక్‌. ప్రతిరోజూ రాత్రి తన భార్యకు యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్‌ను ఇచ్చేవాడు. ఆమెకు తెలీకుండానే ఆహారంలో దానిని కలిపి తినిపించేవాడు. ఆ తర్వాత ఆమె మత్తులోకి జారిపోయేది. ఆ తర్వాత ఇంటికి కొందరు వ్యక్తుల్ని రప్పించేవాడు. వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే, రహస్య కెమెరాల్లో రికార్డు చేసేవాడు. ఇలా దాదాపు పదేళ్లపాటు ఆమెపై పలుమార్లు ఈ అకృత్యాలు జరిగాయి. 2011 నుంచి 2020 మధ్య ఈ దారుణాలు చోటుచేసుకోగా.. 92 సార్లు ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

కాగా, రహస్యంగా చిత్రీకరించిన వీడియోలను “ABUSES”పేరిట సేవ్‌ చేశాడు భ‌ర్త‌. ఈ ఫుటేజ్‌ను పోలీసులు గుర్తించిన తర్వాత బాధితురాలికి తనపై జరిగిన అఘాయిత్యాల విషయం తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె తీవ్రంగా ఆవేద‌న‌కు లోనై విడాకులకు దరఖాస్తు చేసుకుంది. కాగా ఈ కేసులో ఇప్ప‌టికీ భ‌ర్త‌తో స‌హా 52 మందిని అరెస్ట్ చేశారు..మ‌రో 40 మందిని గుర్తించే ప‌నిలో ప‌డ్డారు పోలీసులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement