Tuesday, May 21, 2024

శ్మశానవాటిక, డంపింగ్‌ యార్డులు ప్రారంభం..

‌బెల్లంపల్లి : బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం గ్రామపంచాయితీ పరిధిలో సర్పంచ్‌ ప్రమీళ గౌడ్‌ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్మశాన వాటిక, డంపింగ్‌ యార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ గడ్డం కళ్యాణి-భీమాగౌడ్‌, ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మోటపలుకుల రాజశేఖర్‌, టీఆర్‌ఎస్‌ బెల్లంపల్లి మండల అధ్యక్షుడు సింగం గణేష్ గౌడ‌, సర్పంచులు సురేష్‌, గాజుల వెంకటేష్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎంబడి సురేష్‌, దుర్గం గోపాల్‌, రంగు రవితేజ, జాడి శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement