Wednesday, May 1, 2024

రంగ్ దే… సెన్సార్ పూర్తి

గతేడాది వచ్చిన భీష్మ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు యంగ్ హీరో నితిన్. ఆ తరువాత వచ్చిన చెక్ సినిమా ప్లాప్ కావటంతో డీలా పడ్డాడు. ఈ నేపథ్యంలోనే రంగ్ దే చిత్రంపై పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలకు, ట్రైలర్,టీజర్ లను మంచి స్పందన వచ్చింది. ఇక వచ్చే వారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సెన్సార్ కార్యక్రమాలను కూడా చిత్ర యూనిట్ పూర్తి చేసింది. స్పెన్సర్ బోర్డ్ ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement