Saturday, May 4, 2024

కరెంట్‌ షాక్‌తో ఇద్దరు మృతి..

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీలో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌ తగిలి ఇంటి యజమాని సముద్రంతో పాటు కూలీ వెంకటేష్‌ అక్కడికక్కడే మృతి చెందారు. ఇంటి పని నిమిత్తం ఇంటి పై ఉన్న పైపులు తీస్తుండగా కరెంట్‌ వైర్లకు తాకడంతో యజమాని చిన్న సముద్రం (54), కొండ వెంకటేష్‌ (46) అక్కడికక్కడే మృతి చెందగా మరో కూలీ ఆకుతోట మొండికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించగా మృతి చెందిన చిన్న సముద్రం గత 40 యేండ్ల క్రితం ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డాడు. ఆయన మృతదేహాన్ని సొంత రాష్ట్రమైన తమిళనాడుకు తరలించారు. ఈ మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement