Sunday, May 12, 2024

కరోనా బాధితురాలు ఆత్మహత్య..

బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్‌ బస్తీకి చెందిన సుద్దాల జలజ (55) అనే మహిళ కరోనాతో బాధపడుతూ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త సుద్దాల మొండయ్యకు గత 10 రోజుల క్రితమే కరోనా సోకగా ఆయన హైదరాబాద్‌లోని నీమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారం రోజుల క్రితం మృతురాలు జలజకు కరోనా సోకగా ఆమె ఇంట్లోనే చికిత్స పొందుతూ ఇద్దరికి కరోనా సోకడాన్ని భరించలేక మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు బెల్లంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement