Thursday, May 9, 2024

కలెక్టర్ కి‌ వినతి పత్రం..

బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలంలో బీటీ రోడ్డు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చిన్న వెంకటపూర్‌ నుండి కొత్తూరు వరకు ఐటీడీఏ నిధులతో 6 కిలోమీటర్ల మేర వేశారని సంబంధిత కాంట్రాక్టర్‌పై, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గొల్లపల్లి ఎంపీటీసీ, బీజేపీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మెన హరీష్‌గౌడ్‌, కోఆప్షన్‌ సభ్యుడు చీర్ల కిషన్‌రెడ్డిలు కలెక్టర్‌ భారతి హోళ్లికేరికి ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని, వేసిన 7 రోజుల్లోనే మొత్తం మెటల్‌ పోయిందని, సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, ప్రజలు ఎన్నో సంవత్సరాలు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నా వేసిన రోడ్డు నిరూపయోగంగా ఉండటం, క్వాలిటీ లేని రోడ్డు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ లేకనే క్వాలిటీగా రోడ్డు వేయలేదని, దీనిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకొని, మళ్లీ నాణ్యతతో కూడిన రోడ్డును వేయించాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement