Thursday, May 2, 2024

ADB: పీడీఎస్ బియ్యం పట్టివేత నలుగురిపై కేసు నమోదు

కాగజ్ నగర్ టౌన్, ఫిబ్రవరి 12 (ప్రభన్యూస్): కాగజ్‌నగర్‌ పట్టణంలో వినయ్ గార్డెన్స్ సమీపంలో పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారంతో రూరల్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీలలో ఒక గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచి ఐచర్ వ్యాన్ లో తరలించే క్రమంలో 40 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకోవడం జరిగిందని కాగజ్ నగర్ రూరల్ సీఐ నాగరాజు తెలిపారు. విచారణ చేపట్టిన అనంతరం వాహనం సీజ్ చేసి నిందితులు జకారియా హుస్సేన్,మొహమ్మద్ ఖాజా, రఫీక్ ఖాన్, ప్రసాద్ లపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement