Sunday, April 28, 2024

ADB: పత్తి కొనుగోలులో అవకతవకలు చేస్తే చర్యలు తప్పవు

చెన్నూర్, ప్ర‌భ‌న్యూస్‌: మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్లో సిసిఐ అధ్వర్యంలో చేపడుతున్న పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మోసాలు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టౌన్ సిఐ రవీందర్ హెచ్చరించారు. సోమవారం ఉదయం పట్టణంలోని పత్తి కొను గోలు కేంద్రాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి పత్తి విక్రయాల కు వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తూకలలో ఎలాంటి మోసాలు జరుగకుండా అధికారులు వ్యాహరించలని సూచించారు. రైతులు తమకేదైన ఇబ్బందులు ఎదురైతే పోలీసులకు సమాచారం అందించి సహాయం పొందాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement