Wednesday, May 8, 2024

Boath : ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షలు ఇస్తాం : కాంగ్రెస్ నేత గజేందర్

బోథ్, (ప్రభ న్యూస్) : ఎవరైతే ఇల్లులేని నిరుపేదలు ఉంటారో ఇందిరమ్మ ఇంటికి సహాయం కింద రూ.5 ల‌క్ష‌లు కాంగ్రెస్ పార్టీ అందజేస్తుందని బోథ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు ఆడే గజేందర్ అన్నారు. గడపగడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం మండలంలోని కోట.కె గ్రామంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గజేందర్ గ్రామంలోని పేదల ఇళ్లను సందర్శించారు. వారితో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కూర్మే మహేందర్, నాయకులు నాసర్, భోజన్న, శేఖర్, రాజశేఖర్, పవన్, రాము
అనిల్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement