Sunday, April 28, 2024

Meerpet: కదంతొక్కి కదిలిన యువత… అభినందించిన సబితా ఇంద్రారెడ్డి

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి)… తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్ కు మంచి స్పందన వచ్చింది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ 2కె రన్ ను మంత్రి సబితా రెడ్డి జెండా ఊపి ప్రారంభించి, వారిలో ఉత్సాహం నింపుతూ కదంతొక్కి కదిలారు. అంతకుముందు త్రివర్ణ రంగుల బెలూన్ లను గాలిలోకి వదిలి, రన్ లో పాల్గొంటున్న వారిని అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్ అన్నారు. సమాజంలో పోలీసుల పాత్ర చాలా గొప్పదని, శాంతి భద్రతల పరిరక్షణలో వారి సేవలు ప్రశంసనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు నూతన వాహనాలు, సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. షీ టీం లు దేశానికి ఆదర్శమయ్యాయన్నారు. సామాజిక కార్యక్రమాల్లో యువత ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement