Sunday, April 28, 2024

Current Shock : అన్న‌, పిల్ల‌ల‌ను కాపాడ‌బోయి త‌మ్ముడు మృతి..

బెల్లంపల్లి (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది. అన్న పిల్లలను కాపాడపోయి తన ప్రాణాలు కోల్పోయిన ఘటనతో స్థానికంగా విషాద‌ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. బెల్లంపల్లి పట్టణం బూడిదగడ్డ బస్తీలో శరత్ కుమార్ అనే యువకుడు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటివద్ద ఆటో శుభ్రం చేస్తుండగా అటుగా వ‌చ్చిన‌ ట్రాక్టర్ విద్యుత్ వైర్ల‌కు త‌గిలింది. దీంతో అక్క‌డే ఉన్న ఆటోపై విద్యుత్ వైర్లు తెగిప‌డ్డాయి. ఈ స‌మ‌యంలో ఆటోలో అన్న రాజ్ కుమార్, ఇద్దరు పిల్లలు కూర్చుని ఉన్నారు. వీరిని రక్షించడానికి తమ్ముడు శరత్ కుమార్ య‌త్నించ‌గా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement