Thursday, May 9, 2024

TS : స్ట్రాంగ్ రూంలను పర్యవేక్షించిన ఏసిపి వెంకటేశ్వర్లు

చెన్నూర్, ప్రభన్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూరు (కిష్టంపేట) ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఉన్న స్ట్రాంగ్ రూం లను సోమ‌వారం ఉదయం జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి కే పోలీసులు నియోజక వర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో, సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పెంచారు. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన చెన్నూర్, కోటపెల్లి మండలంలోని హైవే పై ప్రతినిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement