Thursday, May 2, 2024

Accident – ఆర్టీసి బస్సును ఢీకొన్న డి సి ఎం – ఒకరి మృతి

వరంగల్: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో ఆగివున్న ఆర్టీసి బస్సు ప్రయాణీకులు ఎక్కుతుండగా అదుపుతప్పిన డీసీఎం వాహనం బస్సును ఢీ కొన్న ఘటన చోటుచేసుకుంది. జరిగిన ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.

అందులో ప్రయాణం చూస్తున్న మరో నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 ద్వారా వరంగల్ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement