Thursday, May 2, 2024

Breaking : చదువు ముగిసేరోజే తనువు చాలించిన యువకుడు

చదువు ముగిసే రోజే 23సంవత్సరాల యువకుడు తనువు చాలించిన ఘటన నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామ శివారులో జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం బాలాజీ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న ఖుంబం సాయి కిషోర్ అనే యువకుడు ద్విచక్ర వాహనం అదుపుతప్పి మోరిలో పడిపోగా.. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అంబులన్స్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు తెలిపారు.

తలకు బలమైన గాయాలు కావడమే ప్రధాన కారణమని సమాచారం. యువకుడు సూర్యాపేట జిల్లా కేంద్రం చింతల చెరువు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొద్దిసేపట్లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసే క్రమంలో స్నేహితుడు మరణించడంతో యువకులు రోధిస్తున్న తీరు వర్ణణాతీతం.

Advertisement

తాజా వార్తలు

Advertisement