Friday, May 17, 2024

Huzurabad – కౌశిక్ రెడ్డి ఓ సైకో … ప్ర‌గ‌తి భ‌వ‌న్ మ‌ద్ద‌తుతోనే త‌న‌పై హత్య‌కు కుట్ర – ఈట‌ల

హుజూర్ బాద్ – బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ నుంచే తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయం తనకు బీఆర్ఎస్ నేతల నుంచే తెలిసిందని చెప్పారు. సుపారీ ఇచ్చి తనను చంపించేందుకు యత్నస్తున్నారని అన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఒక సైకో అని, శాడిస్ట్ అని, తనతో పాటు బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆయనపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక సైకోను కేసీఆర్ హుజూరాబాద్ కు ఎమ్మెల్సీగా నియమించారని దుయ్యబట్టారు. తన భద్రతను నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలే చూసుకుంటారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement