Monday, May 6, 2024

Honey Bees Attack – మంత్రి బుగ్గన బృందంపై తేనేటీగ‌లు దాడి.. 70 మందికి పైగా గాయాలు

అమరావతి : ఏపీలోని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తేనెటీగల దాడి చేశాయి.. స‌కాలంలో ఆయ‌న స‌హ‌చ‌రులు స్పందించి ఆయ‌న‌ను దూరం తీసుకెళ్ల‌డంతో ఎటువంటి గాయాలు కాకుండా త‌ప్పించుకున్నారు.. అయితే ఆయ‌న వెంట ఉన్న వారిని తేనే టీగ‌లు త‌రిమిత‌రిమి కుట్టాయి .. దీంతో 70 మందికి పైగా గాయాల‌పాల‌య్యారు..

వివ‌రాల‌లోకి వెళితే నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కనుమకింద కొట్టాలలో బుధవారం వివిధ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మంత్రి గ్రామానికి చేరుకున్నారు. మంత్రి వెంట అధికారులు, అధికార పార్టీకి చెందిన నాయకులు,కార్యకర్తలు ఉన్నారు. ఓ చెట్టు వద్ద నుంచి పనులను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు వారిపై దాడి చేశాయి. ఈ దాడిలో 70 మంది వరకు గాయాలు కాగా మంత్రి బుగ్గనను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement