Wednesday, May 29, 2024

Breaking | వన భోజనాలకు వచ్చి అనంత లోకాలకు.. నీట మునిగి వ్య‌క్తి మృతి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయ్యపేటలో ఇవ్వాల (బుధవారం) విషాదం చోటుచేసుకుంది. వరంగల్ కు చెందిన మంచోజు శివ (28) తల్లిదండ్రులతో కలిసి పాపాయ్యపేట గ్రామానికి తన మేనమామ తుమ్మలపల్లి వెంకటేశ్వర్లు వనబోజనాలకు వెళ్తుండగా వచ్చాడు. అందరూ సంతోషంగా భోజనం చేశాక ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు.

కాగా, సాయంత్రం సమయంలో శివ సమీపంలోని పాఖాల వట్టేవాగు (ధర్మరావుపేట రేవు)లోకి దిగాడు. వాగు నీటిలో అంద‌రూ చూస్తుండ‌గానే శివ నీట‌మునిగి పోతుండడంతో గమనించిన అతని తండ్రి, మేనమామ బయటకు తీశారు. అయితే.. అప్పటికే శివ చ‌నిపోయాడు. శివకు ఈత రాకపోవడంతో నీట‌మునిగి చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసుల‌కు ఎలాంటి ఫిర్యాదు అంద‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement