Monday, May 6, 2024

9th Candidate – బ‌హుదూర్ పుర నుంచి ఎంఐఎం అభ్య‌ర్ధిగా ముహమ్మద్ ముబీన్ పోటీ

హైద‌రాబాద్ – అసెంబ్లీ ఎన్నికల కోసం ఎంఐఎం పార్టీ మరో అభ్యర్థిని ప్రకటించింది. బహదూర్ పుర నుంచి ముహమ్మద్ ముబీన్ పోటీ చేయ‌నున్నారు.. ఈ మేర‌కు ఆయ‌న పేరును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురువారం ప్రకటించారు. కాగా, ప్రస్తుతం శాస్త్రిపురం కార్పొరేటర్‌గా ఉన్న జనాబ్ ముహమ్మద్ ముబీన్ గతంలో బహదూర్ పురా, ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఇక ఈసారి ఎంఐఎం తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తోంది. చార్మినార్, చాంద్రాయణ గుట్ట, మలక్ పేట్, నాంపల్లి, కార్వాన్, యాకత్ పుర, బహదూర్ పుర, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ స్థానాల్లో పోటీ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement