Saturday, April 27, 2024

నా బిడ్డను ఆశీర్వదించండిః విజయమ్మ

ప్రజా సేవకై తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడవాలని నిర్ణయించుకున్న వైఎస్ షర్మిలను ఆశీర్వదించాలని ప్రజలను వైఎస్ విజయమ్మ కోరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల సమస్యలు తీర్చడమే లక్ష్యంగా షర్మిల ముందుకు కదులుతారని తెలిపారు. ఖమ్మంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో షర్మిల సంకల్ప సభకు నిర్వహించారు. భారీ అభిమాన సందోహం మధ్య జరిగిన ఈ సభకు విజయలక్ష్మి ప్రత్యేక అతిథిగా వచ్చారు. షర్మిలకు ఆశీస్సులు ఇవ్వడానికే విజయమ్మ వచ్చానని ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ అన్నారు. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 9వ తేదీన తెలంగాణలోని చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరుతో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టారని విజయమ్మ గుర్తు చేశారు. మళ్లీ అదే తేదీన షర్మిల తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారని విజయమ్మ పేర్కొన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై చెక్కు చెదరని అభిమానం చూపుతున్న ప్రజలందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. వైఎస్ఆర్‌ను మీ గుండెల్లో పెట్టుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ఇక్కడి ప్రజలతో తమకు ఉన్న అనుబంధం చెరిగిపోనిదని, తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. కుల, మత, ప్రాంతాలు వైఎస్ఆర్ ప్రేమకు అడ్డుకాలేదన్నారు. మనుషుల్లో ఎందుకు తేడాలని వైఎస్ఆర్ తన పాలనను సాగించారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ప్రతి ఒక్కరి కోసం ఆలోచన చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement