Thursday, April 25, 2024

‘మేజర్’ శోభితా ఫస్ట్ లుక్

ముంబై ఉగ్రదాడుల్లో పోరాడి ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మేజర్ ఉన్ని కృష్ణాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మేజర్. ఈ సినిమాలో ప్రధాన అడవి శేషు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అలాగే సైయూ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఇప్పటికే సైయూ క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.

ఇప్పుడు తాజాగా శోభితా ధూళిపాళ ఫస్ట్ లుక్ ను శుక్రవారం విడుదల చేశారు. ఉగ్ర దాడులు సమయంలో హోటల్ తాజ్ లో చిక్కుకున్న బందీ పాత్రలో ఆమె నటించింది. ఉగ్రవాదులు హోటల్ లోకి ప్రవేశించారు. ఉగ్రవాదులు ఆమె కోసం వచ్చారు. కానీ ఆమె వాళ్లతో ధైర్యంగా పోరాడింది అంటూ అడవి శేషు ట్వీట్ చేశాడు. ఇక శోభిత పేరు ఈ సినిమాలో ప్రమోద అని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement