Friday, April 26, 2024

ప్రజల ఆశీస్సులతో యాత్ర విజయవంతం…. రాహుల్ గాంధీ

ప్రజల ఆశీస్సులతో తన పాదయాత్ర విజయవంతమైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. ఆయన నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర ముగిసింది. ఇవాళ జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించిన సభతో 4 వేల కిలోమీటర్లకుపైగా సాగిన యాత్రకు రాహుల్‌ ముగింపు పలికారు. ఓ పక్క భారీగా మంచు కురుస్తున్నా శ్రీనగర్‌లో భారత్‌ జోడో యాత్ర ముగింపు సభ సాగింది. సభలో రాహుల్‌ గాంధీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.. యాత్రా విశేషాలను వివరించారు రాహుల్‌ గాంధీ.

జోడో యాత్రలో కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఎండ తగలలేదని, ఇప్పుడు మంచు కురుస్తున్నా చలివేయడం లేదన్నారు.. ఎందుకంటే కాంగ్రెస్‌ కార్యకర్తలకు దేశ ప్రజల ఆశీస్సులు నిండుగా ఉన్నాయన్నారు. మొదట్లో నేను రోజుకు 8 నుంచి 9 కిలోమీటర్లు నడుస్తానేమో అనుకున్నా.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాత్ర కొనసాగించామన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 12 రాష్ట్రాల మీదుగా సాగిన ఈ యాత్రను గతేడాది సెప్టెంబర్‌ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, 75 జిల్లాల మీదుగా 145 రోజులపాటు మొత్తం 4 వేల కిలోమీటర్లకు పైగా రాహుల్‌ నడిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement