Friday, March 29, 2024

మహాత్ముడికి ఎమ్మెల్యే జీఎంఆర్ ఘన నివాళి

పటాన్ చెరు : అహింసా మార్గం ద్వారా ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మ‌హాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని.. పటాన్ చెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్కులో గల గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి జాతిపిత చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పృథ్వీరాజ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement