Saturday, April 27, 2024

Flash: సింగరేణిలో ఉద్యోగాల పేరుతో టోకరా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నలుగురు యువకుల నుండి 8 లక్షల నగదు కొట్టేసి టోకరా చేసిన మహిళా బాగోతం జిల్లాలో సంచలనంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం సుబ్బనపల్లికి చెందిన యాసం రాజేశ్వరి (48) అనే ప్రభుత్వ టీచర్ ఈ మోసానికి పాల్పడింది. దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన కూరం నరసింహరావు అనే యువకుడి ఫిర్యాదుతో మహిళ చీటింగ్ వ్యవహారం బట్టబయలైంది. సింగరేణిలో ఇదే తరహా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువుర్ని ఈ మహిళ మోసం చేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దమ్మపేట పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement