Saturday, May 4, 2024

Flash: బ్లేడ్ తో భర్త గొంతు కోసిన భార్య

హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలో దారుణం జరిగింది. పసరగొండ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గ్రామానికి చెందిన మాడిశెట్టి రాజు (30)పై ఆయన భార్య బ్లేడ్ తో దాడి చేసింది. రాజు నిద్ర మత్తులో ఉండగా అతని భార్య మాడిశెట్టి అర్చన గొంతుకోయడంతో రక్తపుమడుగులో గిలగిలా కొట్టుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన వరంగల్లోని ఎంజీఎంకు తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. గొంతులోని నరం తెగడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, నెలరోజుల క్రితం వీరి వివాహం జరుగగా.. ఇద్దరి మధ్యల ఎలాంటి తగాదాలు లేకపోవని స్థానికులు తెలిపారు. అయితే, భర్తపై ఎందుకు దాడి చేసిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement