Thursday, May 16, 2024

Crop Loss – వ‌చ్చే వారం నుంచి పంట న‌ష్ట‌ప‌రిహారం పంపిణి..

హైద‌రాబాద్ – రైతుల‌కు రేవంత్ స‌ర్కార్ శుభ‌వార్త చెప్పింది.. వచ్చే వారం రైతులకు నష్ట పరిహారం ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం రైతులకు నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.10 వేలు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా మార్చిలో 10 జిల్లాల్లో 15,812 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ నిర్ధారించింది. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.. ఇప్పుడు ఆ మొత్తాన్ని వ‌చ్చే వారం నుంచి ఆయా రైతుల ఖాతాల‌లో జ‌మ చేయ‌నున్న‌ట్లు తెలిపింది

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement