Sunday, May 19, 2024

రికార్డ్ స్థాయిలో పత్తి ధర – కేసీఆర్ కు పత్తితో అభిషేకం చేసిన రైతులు

తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లలో పత్తి ధరలు దూసుకెళ్తున్నాయి. మార్కెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెల్ల బంగారానికి రికార్డ్ ధర పలికింది. ఏకంగా క్వింటాకి 10వేల రూపాయలు పలికి అల్ టైం రికార్డ్ కు చేరింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఎప్పుడూ లేనంతగా క్వింటా రూ. 10వేలకు చేరడం ఇదే తొలిసారి.ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం పత్తి మార్కెట్ లో రైతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పత్తితో అభిషేకం నిర్వహించారు.

పత్తితో మన రైతు బంధు కేసీఆర్ అని రాసి కృతజ్ఞతలు తెలిపారు రైతులు. ఈ సందర్భంగా AMC చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, మార్కెట్ సెక్రటరీ మల్లేష్, మంత్రి PA CH.రవికిరణ్ ఆధ్వర్యంలో మార్కెట్ లో సంబరాలు నిర్వహించారు.మంచి లాభసాటి ధర రావటంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతు పెట్టుబడి సాయంతో నేడు వ్యవసాయం సాఫీగా చెసుకోగలుగుతున్నరని అన్నారు. ఈసారి పత్తి దిగుబడి తక్కువ రావడంతో రేటు ఎక్కువ ఉంటుందని రైతులు, వ్యాపారులు భావించారని వివరించారు. గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ నూలుకు అధిక డిమాండ్ ఉన్నందున ధర పెరిగే అవకాశం లేకపోలేదన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement