Saturday, April 27, 2024

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన వినయ్ కుమార్

దేశ రాజ‌ధాని అయిన ఢిల్లీకి 22వ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా ఇటీవ‌లే నియ‌మితులైన సంగ‌తి తెలిసిందే. ఈరోజు ఆయన ప‌ద‌వీ ప్ర‌మాణం చేశారు. మొన్న‌టిదాకా ఈ ప‌ద‌విలో కొన‌సాగిన అనిల్ బైజాల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. వ్యక్తిగ‌త కార‌ణాల వ‌ల్లే తాను ప‌ద‌వి నుంచి తప్పుకుంటున్నాన‌ని బైజాల్ తెలిపారు. బైజాల్ రాజీనామాతో ఖాళీ అయిన ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వర్న‌ర్ ప‌ద‌విలో కొత్త‌గా విన‌య్ కుమార్ స‌క్సేనాను రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ నియ‌మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement