Tuesday, April 23, 2024

దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ : రసమయి బాలకిషన్

దళితుల అభ్యున్నతే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడయ్యారని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో మానకొండూర్ మండలంలోని బంజేరుపల్లి గ్రామానికి చెందిన 22 మంది లబ్దిదారులకు దళిత బంధు యూనిట్లను రసమయి తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ట్రాక్టర్లు, ఎర్టీగా కార్లు, ట్రాలీ మరియు ప్యాసింజర్ ఆటోలు, టాటా ఏసీ గూడ్స్, సెంట్రింగ్, పేపర్ ప్లేట్లు యూనిట్లను ఆయన అందజేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ యూనిట్లను సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యమంత్రి కన్న కళలను నిజం చేస్తూ, అభివృద్ధి చెందాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement