Saturday, April 27, 2024

కేసీఆర్‌ ప్రధాని ఆశలకు గండి.. ఫ్రంట్ ముందుకా, వెనక్కా?

కేసీఆర్‌కి ఐదు రాష్ట్రాల ప్ర‌జ‌లు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. దేశానికి పీఎం కావాల‌నుకుంటున్న కేసీఆర్ ఆశ‌ల‌కు ఈ ఫ‌లితాలు గండి కొట్టాయని ఎద్దేవా చేశారు. ఐదు రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో నాలుగు చోట్ల బీజేపీ కాషాయ జెండాను ఎగ‌రేసింది అని అన్నారు. దీంతో కేసీఆర్​ ఫ్రంట్ ముందుకా, వెనక్కా అన్నట్లు త‌యారైందని విమర్శించారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్​లకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్​ ఏర్పాటు చేయాలనుకుంటున్న కేసీఆర్​కు ఈ ఫలితాలు చాచి కొట్టినట్టైందని అన్నారు. ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల బీజేపీ, మరోచోట ఆప్​ విజయం సాధించాయని పేర్కొన్నారు. దీంతో ఫ్రంట్​ స్పీడ్​కు బ్రేకులు ప‌డ్డాయి అని చెప్పారు. చాన్స్​ దొరికితే నేషనల్​ పాలిటిక్స్​లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్న కేసీఆర్… ఇటీవల ప్రధాని మోడీ పైనే రాజకీయ యుద్ధం ప్రకటించారని మండిపడ్డారు.

‘’తనే స్వయంగా ఇతర రాష్ట్రాల సీఎంలు, ప్రాంతీయ పార్టీల నేతల దగ్గరికి వెళ్లి ఫ్రంట్​ ఏర్పాటుకు సహకారం కోరారు. ఇందులో భాగంగానే తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి అక్కడి సీఎంలను, ఇతర నేతలను కలిసి వచ్చారు. ఈ భేటీలకు ఆశించిన స్పందన రాకపోగా… ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేయ‌ల‌ని క‌ల‌లు క‌న్నాడు. ఈ ఎన్నికల్లో బీజేపీ దెబ్బ తింటుందని, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్​వాదీ పార్టీ పుంజుకుంటుందనే ధీమాతో గులాబీ బాస్ ఉన్నాడు. కానీ ఫలితాలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉండటం… పంజాబ్​లో గెలిచిన ఆప్​తో కూడా టీఆర్​ఎస్​కు సఖ్యత లేక‌పోవ‌డంతో కేసీఆర్ ఆశల మీద నీళ్ళు చల్లినట్టైంది. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ దేశంలోనే అవినీతిపరుడని ఆప్​ ఎమ్మెల్యే సోమ్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌ భారతి బాహాటంగా విమర్శలు గుప్పించారు. ఈ నెల మొదటి వారంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్‌‌‌.‌‌‌‌‌.. ఢిల్లీ సీఎం, ఆప్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ అరవింద్‌‌‌‌‌‌‌‌ కేజ్రివాల్‌‌‌‌‌‌‌‌తో భేటీ కావాలని అనుకున్నారు. అదే సమయంలో కేజ్రివాల్‌‌‌‌‌‌‌‌ బెంగళూరుకు వ్యక్తిగత పర్యటన కోసం వెళ్లారు. కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌ అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోసం టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నేతలు ప్రయత్నించినా అందుకు ఆమ్‌‌‌‌‌‌‌‌ ఆద్మీ నేతలు ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీని నిలబెట్టుకున్నాం. మిగతా మూడు రాష్ట్రాల్లోనూ గెలిచాం. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌‌‌‌‌‌‌‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. దేశ రాజ‌కీయ‌ల్లో చ‌క్రం తిప్పుతామ‌ని చెప్పుకునే వారికి ఈ ఫ‌లితాల‌తో త‌గిన స‌మాధానం చెప్పాం. త‌్వరలోనే తెలంగాణలో కూడా బీజేపీ జెండాను ఎగ‌రేద్దాం. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న కేసీఆర్‌కు త‌గిన బుద్ధి చెబుదాం.’’ అని విజయశాంతి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement