Sunday, May 19, 2024

క‌రోనా కేసులు- కొత్త‌గా 13,265

క‌రోనా కేసులు కొత్త‌గా 13,615న‌మోద‌య్యాయ‌ని కేంద్ర కుటుంబ ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ తెలిపింది. తాజాగా 13,265 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి కారణంగా మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,31,043 యాక్టివ్‌ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.23శాతంగా ఉన్నది. తాజాగా నమోదైన కేసులతో 4,36,52,944కు చేరింది. ఇందులో 4,29,96,427 మంది కోలుకున్నారు. 5,25,474 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 1,99,00,59,536 డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement