Sunday, May 5, 2024

కేరళలో ఢీకొన్న రెండు బ‌స్సులు.. ఊటీ చూడ్డానికి వెళ్తున్న 9మంది విద్యార్థులు మృతి

కేరళలో నిన్న అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. పాలక్కాడ్‌లోని వడక్కంచేరిలో ఈ ఘ‌ట‌న జరిగింది. విద్యార్థులతో కూడిన ఓ టూరిస్టు బస్సు కేరళ ఆర్టీసీ బస్సును వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, ఓ టీచర్, ముగ్గురు కేఎస్‌ఆర్టీసీ ప్రయాణికులు చ‌నిపోయారు. తీవ్రంగా గాయపడిన మ‌రో 35 మందిని ఆసుపత్రికి త‌ర‌లించారు.

ఎర్నాకుళం జిల్లాలోని బేసెలియస్ విద్యానికేతన్‌కు చెందిన విద్యార్థులు, టీచర్లు విహార యాత్ర కోసం తమిళనాడులోని ఊటీ వెళ్తున్నారు. అదేవిధంగా కేఎస్ ఆర్టీసీ బస్సు కోయంబత్తూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారిలో మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement