Saturday, May 11, 2024

దుర్గాదేవి నిమజ్జనంలో విషాదం.. ఎస్సారెస్పీలో ఒకరు గల్లంతు!

కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. రామడుగు మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన పూజారి బింగి ప్రసాద్ బుధవారం రాత్రి ఎస్సారెస్పీ కాల్వలో గల్లంతయ్యారు. సమీపంలోని కొంపల్లి వద్ద ఎస్సారెస్పీ కెనాల్ లో దుర్గాదేవి నిమజ్జనం చేసే ప్రక్రియలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయంలో ఇరిగేషన్​ అధికారులతో ఎమ్మెల్యే సుంకె రవికిశో మాట్లాడారు. వెంటనే కాల్వకు నీటిని నిలిపేయాలని కోరారు. వాటర్​ ఫ్లో తగ్గిపోతే అతని జాడ తెలుస్తుందని చెప్పారు. ఇంకా గాలింపు కొనసాగుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement