Tuesday, May 7, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం బంగారం ధర 22 క్యారెట్లకు రూ.150 మేర పెరిగింది. దీంతో ఇప్పుడు రూ.52,900 వద్ద ట్రేడవుతోంది. ఇదే విధంగా 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.160 ఎగబాకి.. రూ.57,710కి చేరింది. భారత రాజధాని దిల్లీలో కూడా ఇదే విధంగా బంగారం ధర మరింత పెరిగింది. అక్కడ ఇప్పుడు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.150 పెరిగి రూ.53,050 పలుకుతోంది. ఇదే 24 క్యారెట్స్ గోల్డ్ తులానికి రూ.57,860 వద్ద ఉంది.బంగారం ధర స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ వెండి ధరలు పడిపోతున్నాయి. దిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ.50 పడిపోయి.. రూ.71,350కి చేరింది. హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ వెండి రేటు ఒక్కరోజే రూ.500 పడిపోయింది. దీంతో ప్రస్తుతం కిలోకు రూ.73,500కు పడిపోయింది. దిల్లీ కంటే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు కాస్త తక్కువగా ఉంటుంది. వెండి రేటు మాత్రం ఎక్కువ పలుకుతోంది. ప్రాంతాలను బట్టి పన్ను రేట్లలో మార్పులుంటాయి. అందుకే ధరల్లో ఈ హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement