Monday, May 6, 2024

అదృశ్య‌మైన ముగ్గురు విద్యార్థులు మృతి

ఆదివారం అదృశ్య‌మైన ముగ్గురు విద్యార్థులు వాగులో మృతిచెందిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌కాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఈతకువెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఈ ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం.నిడమానూరులో నెల‌కొంది. వాసు(15), జగన్ (12), మహేశ్ (13) లు నిడమానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఆదివారం స్కూల్ కి సెలవు కావడంతో మధ్యాహ్నం వేళ క్రికెట్ ఆడేందుకు పొందూరు పంచాయతీ పొదవారిపాలెం సమీపంలోని మూసీ వాగు వద్దకు వెళ్లారు. వాగును చూసి.. అందులో స్నానం చేద్దామని దిగారు. విద్యార్థులు వాగులోకి దిగడాన్ని గమనించిన కొంద‌రు రైతులు వారిని గద్దించి, అక్కడి నుంచి పంపించేశారు.. అయితే సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాక‌పోవ‌డంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ తెలియక‌పోవ‌డంతో పిల్లల్ని మూసీ వాగువద్ద చూసినట్లు ఎవరో చెప్పగా.. అక్కడికి వెళ్లి చూశారు. అయినా పిల్లలు కనిపించలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. గజఈతగాళ్లతో వాగులో గాలింపు చర్యలు చేపట్టగా ఈరోజు ఉద‌యం ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. అదృశ్యమైన ఆ ముగ్గురు విద్యార్థులు.. మూసీ నదిలో విగతజీవులుగా కనిపించడంతో.. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement