Thursday, May 23, 2024

సెల్ఫీ దిగుతూ ముగ్గురు బాలికలు మృతి

నిర్మల్ జిల్లా తనూర్ మండలం సింగన్ గావ్ గ్రామంలో విషాదం నెలకొంది. ఆదివారం సాయంత్రం సెల్ఫీ దిగుతూ కాల్వలోని నీటిలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. బాలికల మృతదేహాల కోసం స్థానికులు విస్తృతంగా గాలించగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు సునీత(16), వైశాలి(14), అంజలి(14)గా పోలీసులు గుర్తించారు. వీరిలో సునీత , వైశాలి అక్కాచెల్లెలు కాగా అంజలి సమీప బంధువు.

Advertisement

తాజా వార్తలు

Advertisement